AP: అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సాకేరి అనితకు పురిటినొప్పులు రావడంతో అంబులెన్స్ ఫోన్ చేశారు. హుటాహుటిన అంబులెన్స్ బయల్దేరింది. అయితే భారీ వర్షాలకు మార్గమధ్యలో ఉన్న గెడ్డవాగు ఉప్పొంగింది. వాగు ఉధృతికి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో 108 పైలట్ సురేశ్, కుటుంబీకులు ప్రాణాలు పణంగా పెట్టి అనితను సురక్షితంగా వాగు దాటించారు. డుంబ్రిగూడ ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.