ప్రధాని మోదీ ఢిల్లీలో ఏపీ–తెలంగాణ కూటమి ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చి పలు సూచనలు చేశారు. సోషల్ మీడియా విమర్శలకు దృఢంగా స్పందించాలని, కూటమి బలోపేతంపై పని చేయాలని సూచించారు. ఏపీపై మంచి ఫీడ్బ్యాక్ వస్తోందని, చంద్రబాబు పాలన బాగుందని ప్రశంసించారు. పెట్టుబడుల పెరుగుదల అభివృద్ధి సూచికగా పేర్కొన్నారు. టీడీపీ–జనసేన ఎంపీలతో సమన్వయంతో ముందుకు సాగాలని, కూటమి పథకాలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని, ప్రజలతో నిరంతరం టచ్లో ఉండాలని ఆదేశించారు.