AP: మచిలీపట్నంలో YCP ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ" కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోంది. జగన్ పర్యటనలో జరిగిన ప్రమాద ఘటనపై తప్పుడు కేసులు నమోదు చేశారు. సాధారణంగా ప్రమాదాలు జరిగితే డ్రైవర్పై కేసు పెడతారు కానీ, సింగయ్య మృతి ఘటనలో అన్యాయంగా అందరిపై కేసులు పెట్టారు" అని అన్నారు.