AP: రాష్ట్రంలో ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ రిలీజ్ చేసిన ఓ ప్రకటన విద్యార్థులకు వరంగా మరనున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే ఏపీలో నాలుగు రోజులపాటు (జూన్ 10 నుంచి 14 వరకు) భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఉందని అని పలువురు అధికారులు అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.