అరటి రైతులకు జగన్ బీమా చెల్లించినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: ఎమ్మెల్సీ బుచ్చిరెడ్డి

గత ఐదేళ్లలో అరటి రైతులకు బీమా ఇచ్చానని చెప్పడం జగన్ రెడ్డి చెప్పే మరో పచ్చి అబద్ధం అని ఎమ్మెల్సీ బుచ్చిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. 2019–24 మధ్య ఒక్క ఎకరాకు కూడా అరటి పంట బీమా చెల్లించలేదని ఆరోపించారు.  ఒక్క పైసా ప్రీమియం ఇచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. చెల్లించినట్టు చూపిస్తే, తాను రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. లేకపోతే  పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్