AP: 1996 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మినిమం టైం స్కేల్ పద్ధతిలో టీచర్ పోస్టులు ఇవ్వాలని ఆదేశించింది. 1998, 2008 అభ్యర్థులకు ఇచ్చినట్టు తమకు కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్స్ ఇవ్వాలని 1996 డీఎస్సీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అర్హతలను బట్టి ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆదేశించింది.