'ఏపీలోని మహిళలకు త్వరలో రూ.1500'

ఏపీలో మహిళలకు నెలకు రూ.1500 చొప్పున సాయం పంపిణీపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18,000 అందిస్తామని తెలిపారు. మహాశక్తి పేరుతో ఈ పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సాయం విషయంలో ఎవరికీ అన్యాయం చేయమని స్పష్టం చేశారు. విధివిధానాలు రూపొందించి త్వరలోనే ఈ పథకం అమలు చేస్తామని ఆమె వెల్లడించారు.

సంబంధిత పోస్ట్