AP: విశాఖపట్నంలో శుక్రవారం సీఎం చంద్రబాబు డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… త్వరలో విశాఖలో సీ కేబుల్, డేటా సెంటర్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. గత పాలకులు విశాఖను రాజధాని చేస్తామని చెప్పారని, రాజధాని వద్దని విశాఖ వాసులు తీర్పుఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.