ఏపీలో స్కూళ్లకు క్రమం తప్పకుండా హాజరుకాని టెన్త్ విద్యార్థుల కోసం సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా డివిజన్ స్థాయిలో 50 వసతి గృహాలను సోమవారం ప్రారంభించనున్నారు. స్థానిక ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను హాస్టళ్లకు తీసుకువస్తారు. అక్కడ వసతి, భోజనంతో పాటు ప్రత్యేక తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహిస్తారు. టెన్త్ ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నారు.