అమరావతిలోని మేఘా సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదానికి సెక్యూరిటీ గార్డ్ రాము కారణమని తేలింది. వరుసగా సెలవులు ఇవ్వకుండా డ్యూటీలు వేయడంతో ఆగ్రహించిన రాము, సైట్లోని జనరేటర్లోని డీజిల్ ఉపయోగించి పైపులకు నిప్పు పెట్టినట్లు అంగీకరించాడు. ఘటనకు ముందు సూపర్ వైజర్తో ఫోన్ కాల్లో గొడవపడినట్లు సమాచారం. అనంతరం అగ్ని ప్రమాద వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు.