AP: ఉండవల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఇవ్వని పొలాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమ భూములు లాక్కోవద్దని రైతులు ఆందోళన చేయగా.. పోలీసులు భారీగా మోహరించారు. దాంతో రైతులు, పోలీసులు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల సమక్షంలో అధికారులు జేసీబీలతో పంటలను ధ్వంసం చేయించారు.