మాజీ సీఎం వైఎస్ జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ వల్ల పడిన ఇబ్బందులను విజయసాయిరెడ్డి తనకు చెప్పారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడామని షర్మిల తెలిపారు. అయితే తన పిల్లలకు సంబంధించిన విషయమే తాను చెబుతానని షర్మిల అన్నారు. షేర్లు తనకే చెందాలంటూ తనపై, తన తల్లిపై జగన్‌ కేసు వేశారని షర్మిల ఆరోపించారు. తన మాటలు అబద్ధాలని విజయసాయితో జగనే చెప్పించారని షర్మిల అన్నారు.

సంబంధిత పోస్ట్