AP: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పాతపట్నం జడ్పీటీసీ లింగాల ఉషారాణి, సీతారాంపల్లి సర్పంచ్, వైస్సర్పంచ్, కోదూరు మాజీ జడ్పీటీసీ జన్ని చిన్నమ్మి, జన్ని అప్పన్న, సీహెచ్సీ మాజీ డైరెక్టర్ కనకల కర్రెన్న ఆధ్వర్యంలో వందలాది వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. మొత్తంగా 500కు పైగా కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.