ఆరేళ్ల బాలికకు స్క్రబ్‌టైఫస్ పాజిటివ్

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని తొండవాడలో స్క్రబ్‌టైఫస్ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక కొంత కాలంగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. రక్త పరీక్షలు నిర్వహించగా.. స్క్రబ్‌టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో బాలికకు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. డాక్టర్ కుసుమ ఆదేశాలతో చంద్రగిరి వైద్యాధికారులు గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్