న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముట్టడి

గుడ్లూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. అడవి రాజుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలుడికి కాలు తొడ తెగిపోవడంతో చికిత్స పొందుతూ ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు బాలుడి మృతదేహాన్ని గుడ్లూరు స్టేషన్ వద్ద ఉంచి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు వెళ్లేది లేదంటూ నినాదాలు చేశారు. వారిని కట్టడి చేయడం పోలీసులకు చాలా క్లిష్టంగా మారింది.

సంబంధిత పోస్ట్