కందుకూరు: పలు ప్రాంతాల్లో నేడు పవర్ కట్

కందుకూరులోని పలు ప్రాంతాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కోవూరు రోడ్డులో నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నందున బలరామయ్య తోట, సాయి నగర్, విజయనగర్ కాలనీ, ఐఎస్ రావు నగర్, 60 అడుగుల రోడ్డు ప్రాంతాలలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ టౌన్ ఏఈ నరసింహం తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్