బోగోలు మండలం కడనూతల జాతీయ రహదారి వద్ద జరిగిన ప్రమాదంలో ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్న ధనియాల విజయ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. విజయ్ కుమార్, వినయ్ లు బోగోలు వైపు వెళుతుండగా మోటార్ సైకిల్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఘటనా స్థలంలోనే విజయకుమార్ మృతి చెందగా మరో విద్యార్థి వినయ్ కి గాయాలయ్యాయి. దీంతో ఆ కళాశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.