నెల్లూరులో విజయవంతంగా కార్యకర్తల సమావేశం

నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ (పురమందిరం)లో మంగళవారం జనసేన పార్టీ నెల్లూరు పార్లమెంట్ సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమాచార సేకరణ కమిటీ మరియు జనసేన కార్యకర్తల సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశానికి బొమ్మిడి నాయకర్ (ఎమ్మెల్యే, చీఫ్ విప్, సాధక్ కమిటీ చైర్మన్ – ఆంధ్రప్రదేశ్) ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో వివిధ విభాగాల్లో సేవలందించేందుకు ఆసక్తి ఉన్న నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్