విద్యుత్ కోతతో దోమల బెడద, ఉక్కపోతతో ప్రజల ఇక్కట్లు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మనులపూడి, పురంధరపురం, రెడ్డిపాలెం గ్రామాల్లో ప్రతిరోజూ రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతోంది. దీనితో చిన్న పిల్లలతో సహా ప్రజలు దోమల బెడద, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి కరెంట్ పోవడం వల్ల నిద్రలేకుండా జాగారం చేయాల్సి వస్తోంది. అధికారులు ఈ చర్యలకు గల కారణాలను వివరించకపోవడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్