ముగ్గురు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) వసుమతి ముగ్గురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఆదివారం జారీ చేశారు. ముత్తుకూరు(M) నేలటూరు, ఈపూరు బిట్-1బీ, చిల్లకూరు(M) లింగవరం గ్రామ పంచాయతీ కార్యదర్శులకు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నిధుల వినియోగంలో అవకతవకలపై సమగ్ర విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్