ప్రభుత్వ పథకాలపై సమీక్ష

నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మారంరెడ్డిపల్లి పంచాయతీ గంధంవారిపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఎస్.ఐ.ఆర్ (SIR) కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు పాల్గొన్నారు. స్థానిక బి.ఎల్.ఓ (BLO) తో కలిసి ప్రజలకు అవసరమైన సేవలపై సమీక్ష జరిపిన ఆయన ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంపై స్థానికులు హర్షం వ్యక్తం చేయగా, నాయకుల భాగస్వామ్యం కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్