ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం వెలువరించిన తీర్పు హర్షించదగ్గ విషయమని ఉదయగిరి ఎమ్మార్పీఎస్ నాయకులు బకీరు జాషువా, బెజవాడ బాల గురువయ్య తెలిపారు. వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన బిల్లుకు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.