అనంతపురం హెచ్ఎల్సీ కాలనీలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వటసావిత్రి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విజయసాయికుమార్, దేవరకొండ బాలాజీ శర్మ మాట్లాడుతూ.. మర్రిచెట్టు నిత్యం పచ్చగా ఉండినట్లే ప్రతి సుమంగళి కలకాలం పసుపు-కుంకుమలతో సౌభాగ్యవతిగా ఉండాలని కోరుతూ మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారన్నారు. ఈ వ్రతం ద్వారా మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షును కోరుకుంటారు.