ధర్మవరంలోని కేతిరెడ్డి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాషా (28) బుధవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి బాషాను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అప్పుల బాధతోనే బాషా ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య ఫాతిమాభి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేశారు.