ధర్మవరం పట్టణం ఎల్సికేపురంలో జింక శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి అతిగా మద్యం సేవించి కిందపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శాంతినగర్ నివాసి అయిన శ్రవణ్ కుమార్ తరచుగా మద్యం సేవిస్తూ ఉండేవాడని, మద్యం మత్తులో కిందపడి మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదని సమాచారం.