చిలమత్తూరు మండల కేంద్రంలోయూనిక్ మిల్లెట్ మాల్ట్ స్టాల్ చిరుధాన్యాలజావ హోటల్ యజమాని (ప్రసాద్ రెడ్డి)కి చెందిన ఫ్లెక్సీలు శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ పొట్టకూటికోసం హోటల్ నడుపుకుంటుంటే ఇలా చేయడం చాలా దారుణంగా ఉందని యజమాని ఆవేదన చెందారు. ఇలా మరి ఎవరికి జరగకుండా చూడాలని మనవిచేశారు.