రోడ్డు ప్రమాదంలో తండ్రీ, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గాండ్లపెంట మండలం కుమ్మరపల్లె గ్రామానికి చెందిన సోమశేఖర్ (35), భార్య కవిత, పిల్లలు రెడ్డిశేఖర్(5), సిద్ధేశ్వరి (3) అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉంటున్నారు. కదిరిలో కర్మకాండలకు కుటుంబంతో శనివారం బైక్ పై బయలుదేరారు. ములకలచెరువు వద్ద మినీ లారీ ఢీకొనడంతో సోమశేఖర్, సిద్ధేశ్వరి మృతి చెందారు. కుమారుడు రెడ్డిశేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.