పాలన చేతగాక వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు రాజకీయం: ఉమన్న

ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక పాలన చేతగాక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అమలు గాని హామీలు ఇచ్చి 100 రోజుల పాలన తర్వాత ప్రజల్ని వెంకటేశ్వరస్వామి భక్తులను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా లడ్డూ కల్తీ వివాదాన్ని చంద్రబాబు లేవనెత్తారన్నారు.

సంబంధిత పోస్ట్