బ్రహ్మసముద్రం మండలం సూగేపల్లి, ఐదుకల్లు గ్రామాలలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా రహదారి కోతకు గురైంది. దీంతో వాహనాలు, ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షంతో రహదారి పూర్తిగా దెబ్బతింది. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. మరోవైపు బ్రహ్మసముద్రం మండలంలోని సంతే కొండాపురం చెరువుకు వర్షం నీరు భారీగా చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.