కళ్యాణదుర్గం: సరస్వతీదేవి అలంకారంలో వాసవి మాత అమ్మవారు

కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బుధవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు వాసవి మాతకు సరస్వతీ దేవి అలంకారం చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్