కంబదూరు మండలం ములకనూరు గ్రామంలో తిమ్మరాయప్ప స్వామి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం గావు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి స్వామిని దర్శించుకున్నారు. జాతర సందర్భంగా రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించారు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.