బ్రెయిన్ స్ట్రోక్ తో న్యాయవాది రామమూర్తి మృతి

కళ్యాణదుర్గం పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న రామమూర్తి బ్రెయిన్ స్ట్రోక్ తో శుక్రవారం మృతి చెందారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హుటాహుటిన బెంగుళూరు తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. న్యాయవాది రామమూర్తి మృతిపై బార్ అసోసియేషన్ సభ్యులు, పలువురు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్