సత్య సాయి జిల్లా అగలి మండలం కసాపురం గ్రామం నందు సోమవారం మధ్యాహ్నం రొళ్ళ మండలం కు చెందిన నీళ్ల ట్యాంకర్ వాహనాన్ని డ్రైవర్ రఘు అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి కసాపురం గ్రామానికి చెందిన చిన్న గిరియప్ప ఢీ కొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన కు సంబందించి శివకుమార్ ఫిర్యాదు మేరకు అగళి ఎస్ ఐ రంగడు యాదవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.