రోడ్డు ప్రమాదం వ్యక్తికి గాయాలు

మడకశిర పట్టణం వడ్రపాల్యం సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మడకశిరకు చెందిన యువకుడు స్కూటీపై వెళ్తూ రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాధితుడిని మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అధిక వేగమే కారణమని తెలిసింది.

సంబంధిత పోస్ట్