ఆ స్థలాల యజమానులకు హెచ్చరిక

పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలోని స్వంత స్థలాల యజమానులకు అధికారులు హెచ్చరిక జారీ చేసారు. సోమందేపల్లి మండల కేంద్రంలో సొంత స్థలం ఉండి, దానిని పట్టించుకోచుండా వదిలేస్తే ఉరుకోమన్నారు. నాలుగు రోజులలో వారి స్థలాల్లోని చెట్లు, కంప చెట్లు, చెత్త చెదారం తొలగించాలన్నారు. అలా చేయని ఎడల వారి స్థలంలో పంచాయితి బోర్డు నాటి, భవిషత్ లో ఆ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు జరగకుండా అనుమతులు నిరాకరిస్తామని పంచాయితీ కార్యదర్శి రామాంజినేయులు తెలిపారు.

సంబంధిత పోస్ట్