సోమవారం ఓబులదేవరచెరువులో జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. బియ్యం గోడౌన్ వెనుక భాగంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ ఒక్కరే ఉండగా, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది.