వరద బాధితులకు విరాళం అందజేత

పుట్టపర్తి పట్టణం గోవిందపేట సేవా సమితి సభ్యుల తరపున మంగళవారం.. విజయవాడ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 వేల అందజేసారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్ చేతన్ కు అందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ రామప్ప, స్టోర్ డీలర్ నాయుడు, సమాజసేవకులు షామీర్ భాష, కడియాల కృష్ణమోహన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్