పుట్టపర్తి సమీపంలోని చెరువు కట్టపై వెలసిన దుర్గమ్మ అమ్మవారు శనివారం లలితా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ప్రతిరోజు ఒక అవతారంలో దర్శనం ఇస్తున్నారు. లలితా దేవి అలంకరణలో దర్శనమివ్వడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు.