పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా శ్రీసత్యసాయి బాబా మహా సమాధి వద్ద నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నాను. ఈ సందర్బంగా భగవాన్ సత్యసాయి బాబా సమాధికి నివాళులు అర్పించారు.