కొత్తచెరువు ఉద్యోగుల పునర్విభజన పారదర్శకంగా నిర్వహించాలని డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టుబడి గౌస్, రాష్ట్ర కార్యదర్శి షర్ఫోద్దీన్ డిమాండ్ చేశారు. శ్రీసత్యసాయి, పుట్టపర్తి మండల కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ ఏడీలకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ ప్రక్రియలో స్పౌజ్ కేటగిరీకి, వితంతువులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో ఉన్నప్పుడు ఒకేచోట పనిచేసేందుకు వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.