చందమూరు వద్ద ఉదృతంగా పారుతున్న వంక

చెన్నేకొత్తపల్లి మండలంలోని చందమూరు గ్రామం వద్ద వంక గురువారం ఉదృతంగా పారుతోంది. బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఉక్క పోత తో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రాత్రి వర్షంతో మండలంలో వాతావరణం చల్లబడింది.

సంబంధిత పోస్ట్