ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీడీవో

పుట్లూరు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో ఎంపీడీఓ యోగానందరెడ్డి మంగళవారం పర్యటించారు. ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా ఫించన్ కానుకను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పింఛన్ ను అందజేశారు. పింఛన్ పంపిణీలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని గ్రామ సచివాలయ సిబ్బందికి ఎంపీడీఓ యోగానంద రెడ్డి సూచించారు.

సంబంధిత పోస్ట్