ఫారం పాండ్ పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

యల్లనూరు మండలం బొప్పేపల్లి పంచాయతీలోని వాసాపురం గ్రామానికి చెందిన రైతు శివప్రసాద్ పొలంలో ఫారం పాండ్ పనులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 92 వేల రూపాయల అంచనాతో రైతుకి చెందిన మూడెకరాల పొలంలో 8 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుతో, 88 క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో ఫారంపాండ్ పనులను చేపట్టారు.

సంబంధిత పోస్ట్