నేడు బొప్పేపల్లికి కలెక్టర్ రాక

యల్లనూరు మండలంలోని బొప్పే పల్లి గ్రామంలో మంగళవారం జరగనున్న పొలంబడి కార్యక్రమానికి కలెక్టర్ వినోద్ కుమార్ హాజరు కానున్నారని ఏఓ రామకృష్ణ సోమవారం ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుందన్నారు. జాయింట్ డైరెక్టర్ తో పాటు మండల స్పెషల్ ఆఫీసర్, మిగిలిన అధికారులు హాజరవుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్