బాలాత్రిపురసుందరిదేవి అలంకారంలో శ్రీగాయత్రిమాత

తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్ జీరో రోడ్డులో వెలసిన శ్రీవేదమాతగాయత్రిదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలాత్రిపురసుందరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమ్మ వారిని బాలాత్రిపురసుందరిదేవిగా అలంకరిం చారు. పెద్దఎత్తున భక్తులకు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్