శ్రీరాజరాజేశ్వరిదేవి అలంకారంలో వాసవిమాత

తాడిపత్రి పట్టణంలోని మెయిన్ బజార్ లో వెలసిన శ్రీకన్యకాపరమేశ్వరిదేవి అమ్మవారిశాలలో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీరాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారిని శ్రీరాజరాజేశ్వరిదేవిగా అలంకరించారు. పెద్దఎత్తున భక్తులకు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్