ఉరవకొండ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

బెళుగుప్ప మండలం కాలువపల్లి వద్ద అనంతపురం-కళ్యాణదుర్గం బైపాస్ లో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. రెండు లారీలు అతివేగంగా వచ్చి పరస్పరం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయపడ్డారు. క్షతగాత్రులనుగాయపడ్డవారిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్