లావేరు మండలం రావివలస గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున సిరుగుడి నారాయణప్పారావు అనే రైతు మూడు గడ్డి కుప్పలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. ఈ ప్రమాదంలో గడ్డి కుప్పలు కాలిపోయాయి. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు అగ్నిమాపక కేంద్రానికి తెలియపరచగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే పూర్తి స్థాయిలో గడ్డి కుప్పలు కాలిపోవడంతో లబో దిబో మంటున్న కుటుంబసభ్యులు.