ఇచ్ఛాపురం: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడి మృతి

ఇచ్ఛాపురం మండలం ఈదుపురం వెళ్లే రహదారిలో ఒక ఇటుకలు బట్టీ సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇచ్ఛాపురం నుంచి తన స్వగ్రామమైన కవిటి మండలం కే. కాపాసుకుద్ది గోకుల రవి వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభానికి ఢీకొని ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీనిపై ఇచ్ఛాపురం టౌన్ ఎస్ఐ ముకుందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్