నరసన్నపేట పంచాయితీ వజ్రం పేటలో గత ఆరు నెలలుగా ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ కొళాయిలతో పాటు ఇంటి కుళాయిలకు కూడా నీరు రావడం లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రతిరోజూ నీటి కోసం గృహిణులు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి.